Search
Close this search box.
Search
Close this search box.

డ్రైనేజీ సమస్యలతో స్థానికులు సతమతమవుతుంటే పట్టించుకోని ఏకగ్రీవ వైసిపి కార్పొరేషన్ : గునుకుల కిషోర్

గునుకుల కిషోర్

             నెల్లూరు ( జనస్వరం ) : జనసేన కార్యకర్తల ఆత్మీయ పలకరింపులో భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గారు 21 డివిజన్ జనసేన కార్యకర్త శరవణ ఆధ్వర్యంలో వారి ఇంటి చుట్టుపక్కల వారిని జనసేన పార్టీకి మద్దతు తెలపాల్సిందిగా కోరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ గెలిచిన వై సి పీ కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో లేరు. అనేక డివిజనులతో డ్రైనేజీ సమస్యలతో ఇబ్బంది పడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలి అనారోగ్యానికి గురి అవుతున్న ప్రజలను పట్టించుకునే నాధుడే లేరు కార్పొరేటర్ లో అందుబాటులో ఉండరు. ఫోన్ ట్యాపింగ్ చేసి మీ నాయకులు ఏమి అనుకుంటున్నారో అని తెలుసుకోవటం కాదు జగన్ గారు పరదాలు తీసి మీ ప్రభుత్వం గురించి ప్రజలు ఎం అనుకుంటున్నారో కనుక్కోండి. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గెలిచిన కార్పొరేటర్లు సంపాదించుకోవడమే ధ్యేయంగా ఉన్నారు. సుపరిపాలనే ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఈసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. గాజు గ్లాస్ కి ఓటు వేయించడమే ముఖ్య లక్ష్యంగా ఆరు రోజులుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ తో పాటు శరవణ, సుమంత్ కుమార్, నయీం, హుస్న, సతీష్, సాయి, వెంకీ, తులసి రామ్, ప్రశాంత్ గౌడ్, కంథర్, హేమచంద్ర యాదవ్, ప్రసన్న, మౌనేష్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way