శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సేవలో జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు

బొర్రా వెంకట అప్పారావు

           నకరికల్లు, (జనస్వరం) : నకరికల్లు గ్రామంలోని వేంచేసియున్న స్వయంభు శ్రీ చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానాన్ని నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు సందర్శించి స్వామి వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం స్వామివారి 10వ వార్షికోత్సవ సందర్భంగా ఆరవ తారీకు జరుగు అన్న సంతర్పణ కార్యక్రమానికి రూ.25000 విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో నగరికల్లు మండల పార్టీ అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ, నకరికల్లు మండలం జాయింట్ సెక్రెటరీ సతికల ఏడుకొండలు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, సత్తెనపల్లి నియోజకవర్గం 7 వాడు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, సత్తెనపల్లి రూలర్ మండలం అధ్యక్షుడు నాదెళ్ల నాగేశ్వరావు, ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్, రాజుపాలెం మండల అధ్యక్షుడు తోట నరసయ్య, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు బత్తుల కేశవ, రాం కిట్టయ్య, మురళి, షేక్ జానీ పీర్, షేక్ సైదా, పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way