వినుతా కోట ఆధ్వర్యంలో దయనేడు గ్రామంలో జనసేన శ్రమదానం

వినుతా కోట

         శ్రీకాళహస్తి ( జనస్వరం ) : శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం దయనేడు గ్రామానికి బస్సు సౌకర్యం లేదని గ్రామస్థులు జనసేన పార్టీ దృష్టికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా గారు KNOW MY CONSTITUENCY కార్యక్రమం లో భాగంగా పర్యటించినప్పుడు తెలిపారు. ఆ గ్రామం కి వెళ్ళే దారి గుంతలమయం అయినందున బస్ రాకపోకలకు నిలిపివేయడం జరిగింది. అధికారుల దృష్టికి జనసేన పార్టీ తీసుకుని వెళ్ళినా జిల్లా కలెక్టర్, మండల అధికారులు స్పందించక పోవడంతో జనసేన పార్టీ నాయకులు ,జనసైనికులు నియోజకవర్గ ఇంఛార్జి వినుత కోటా గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రమదానం చేసి కలవకుంట నుండి దయనేడుకు వెళ్లే 2 కి.మీ రోడ్డులో ఉన్న గుంతలను పూడ్చి బాగుచేయడం జరుగుతుందని అన్నారు.  రోడ్డుకు ఇరువైపులా అడ్డుగా ఉన్న చెట్లను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పాల గోపి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు భవాని శంకర్, నాయకులు రవి కుమార్ రెడ్డి, నితీష్ కుమార్, గణేష్, గాంధీ, బాలాజీ, కాటేశ్, వెంకటరమణ, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way