జనసేన పార్టీతోనే రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, మహిళా సాధికారత సాధ్య౦ : గుంటూరు జనసేన వీర మహిళలు

గుంటూరు

            గుంటూరు ( జనస్వరం ) : జనసేన పార్టీతోనే రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, మహిళా సాధికారత సాధ్యమని గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని జనసేన పార్టీ పొన్నూరు నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం జనసేన మహిళా విభాగం ఆధ్వర్యంలో వీర మహిళల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, అడుగడుగునా మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆమె దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకు అండగా ఉండే విధంగా వీర మహిళలు గ్రామస్థాయి నుండి జనసేన పార్టీని బలోపేతం చేయాలని, రానున్న ఎన్నికలలో జనసేన పార్టీని అధికారంలో తెచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే విధంగా వీర మహిళలు కృషి చేసి పార్టీ గెలుపులో భాగస్వాములు కావాలని బిట్రగుంట మల్లిక పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మహిళా విభాగం నేతలు రావి రమ, బడే కోమలి, సోమరాతు అనురాధ, పోకల కమల, వీర మహిళలు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way