మాకినీడి శేషు కుమారి ఆధ్వర్యంలో పి.రాయవరం జనసేన పార్టీ గ్రామ కమిటీ సమావేశం

మాకినీడి శేషు

         పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషు కుమారి గారు పిఠాపురం మండలం పి. రాయవరం గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నాయకులు జన సైనికులతో కలిసి అక్కడ ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలవేసి జై భీమ్ చెప్పి గ్రామ కమిటీ సమావేశంలో పాల్గొని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ కమిటీ అంటే ఒక పదవి కాదు ఒక బాధ్యతని గుర్తు చేసి ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి సోల్జర్స్ లో పనిచేయాలని, ప్రతి జనసైనికులను నాయకులను కలుపుకొని పోయి వారికి అండగా కష్టకాలంలో బలంగా నిలబడమని వారికి సూచించారు. గ్రామ కమిటీ నియమించటం జరిగిందని గ్రామ ప్రెసిడెంట్ గా మాదేపల్లి పద్మరాజు నియమించారు. అలాగే పిఠాపురం నియోజవర్గం అంతా కూడా గ్రామ కమిటీ వేసి పార్టీని మరింత బలంగా చేసే విధంగా అడుగులు వేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way