గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వo చే ప్రశంస పత్రం అందుకున్న గుడివాడ పట్టణ జనసైనికులు

గుడివాడ

          గుడివాడ ( జనస్వరం ) : కృష్ణాజిల్లా గుడివాడ పట్నంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గుడివాడ పట్టణ జన సైనికులు మాచర్ల రామకృష్ణ (Rk) కు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్ భాష, సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ జాషువా గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కార్ ప్రశంస పత్రాన్ని అందజేసి అభినందనలు తెలపడం జరిగింది.  ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంతో  శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంతో మా టీం చేస్తున్న సేవా కార్యక్రమాలకు అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రశంస పత్రం అందుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు. గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మా టీమ్ ని ప్రోత్సహిస్తున్న గుడివాడ పట్టణ ప్రజలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి, పోలీసువారికి, ప్రభుత్వ అధికారులకు మరియు మీడియా వారికి అలాగే సేవా కార్యక్రమాలకు నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, అయ్యప్ప, చరణ్, మట్టా జగదీష్, సురేష్, మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way