పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ భయం పట్టుకుంది : జనసేన నాయకులు సయ్యద్ నాగుర్ వలి

         నకరికల్లు, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అంటే వైసీపీ భయం పట్టుకుందని జనసేన పార్టీ నకరికల్లు మండల వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి అన్నారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. జనసైనికులే పార్టీకి బలమని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టి బూత్ లెవెల్ నుంచి కేడర్ నిర్మిస్తామని తెలిపారు. అలాగే వైసీపీ ఆగడాలను అడ్డుకుంటామని, ప్రజా క్షేత్రంలో వైన్.. మైన్,, ఇసుక అక్రమాలపై ఉద్యమిస్తామని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Facebook