నిరుపేద కుటుంబానికి జనసేన సాయం : బాడిశ మురళీకృష్ణ

నిరుపేద కుటుంబానికి జనసేన సాయం : బాడిశ మురళీకృష్ణ

        జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో నివసిస్తున్నటువంటి నిరుపేద కుటుంబం పల్లపు శ్రీను రిక్షా తొక్కుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూన్నారు. ఒక ఆక్సిడెంట్ లో తన కాలికి పెద్ద గాయమై నడవలేని స్థితిలో ఉండటం వలన కుటుంబం గడవటం చాలా కష్టమైన పరిస్థితి లో ఉండటంతో ఈ విషయాన్ని గమనించిన గండ్రాయి గ్రామానికి చెందిన జనసేన నాయకులు పొట్లకాయల నాగయ్య ఆ కుటుంబాన్ని దత్తత తీసుకొని గత నెల రోజులుగా వారికీ నిత్యవసరా వస్తువులు ఇస్తున్నారు. అలాగే ఈ రోజు కూడా నాగయ్య ఆధ్వర్యంలో సరుకుల పంపిణీలో భాగంగా జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ అతన్ని పరామర్శించి మురళీకృష్ణ చేతులు మీదుగా వారికీ 25 కేజీల బియ్యం మరియు నెలకు సరిపడ నిత్యావర సరుకులు, కూరగాయలు అందించడం జరిగింది. అలాగే మురళీకృష్ణ మరియు మండల నాయకులు తులసి బ్రహ్మం వారిక వైద్య ఖర్చుల నిమిత్తం కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ మాట్లాడుతూ వారికీ కాలికి గాయం తగ్గేంత వరకు ఆ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని వారికీ భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేన మండల నాయకులు తులసి బ్రహ్మం గండ్రాయి గ్రామ జనసైనికులు కర్లపూడి గోపి, నామాల వెంకటేష్, మైదాసు గోపి, పల్లపు గోపి, కృష్ణ, కనకారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way