Search
Close this search box.
Search
Close this search box.

ప్రజల స్వేచ్ఛను కాలరాస్తున్న వైసీపీ : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి వినోద్ రెడ్డి

        నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 238వ రోజున 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఆటో స్టాండ్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎల్లకాలం అధికారం ఒక్కరికే ఉండదని, ప్రజాసంక్షేమం, సమాజాభివృద్ధిని బట్టి ప్రజలు అధికారంలో ఉండే పార్టీలకు మరలా అధికారం అందిస్తారని కానీ నేడు రాష్ట్రంలో వైసీపీ ఈ విషయాన్ని మరచి నియంతృత్వ ధోరణిలో వెళ్తూ ప్రజలపై ఉన్మాదంగా ప్రవర్తిస్తోందని అన్నారు. నిరంకుశ పాలనకు సూచికగా జీవో 1 లాంటివి తీసుకురావడం, ప్రజాస్వామ్యానికి తిలోదకాలిచ్చి పోలీసులచే బ్యూరోక్రాట్ పాలన సాగించడం, ప్రతి 50 ఇళ్ళకు వాలంటర్ల పేరుతో ప్రజల మీద నిఘా పెట్టి ప్రభుత్వ తీరుపై వ్యతిరేకంగా ఉన్నవారిని వేధింపులకు గురిచేయడం పలు ఉదాహరణలు అని అన్నారు. వైసీపీ ప్రభుత్వ ఈ విధమైన తీరుతో ప్రజల్లో అభద్రతాభావం పెరిగిపోతోందని, ప్రజల స్వేచ్ఛను వైసీపీ కాలరాస్తోందని అన్నారు. పవనన్న ప్రజాబాటలో ఏ ఇంటికి వెళ్తున్నా ఈ ప్రభుత్వ దూరగతాలను, అణచివేత ధోరణి గురించి ప్రజలే తమకు వివరిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టడం ఖాయమని తెలిపారు. ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిపై ఎంతో నమ్మకంతో ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గెలిచేది తామేనని, ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే అవకాశాలను కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way