Search
Close this search box.
Search
Close this search box.

హరిరామ జోగయ్య శాస్త్రి గారిని పోలీసులు అదుపులో తీసుకోవడం సమంజసం కాదు : పూల శివ ప్రసాద్

హరిరామ జోగయ్య శాస్త్రి

       పుట్టపర్తి ( జనస్వరం ) : బలిజ, కాపుల రిజర్వేషన్ల కోసం కాపు సంక్షేమ శాఖ వ్యవస్థాపకులు హరిరామ జగయ్య గారు నిరాహార దీక్ష చేస్తుండగా నిన్నటి రోజు రాత్రి 10 గంటల సమయంలో పోలీసుల వారు 85 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి అనికూడ చూడకుండా అదుపులో తీసుకుని ఆయనను తీసుకెళ్లడం ఏమాత్రం సమంజసమైన చర్య కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. ఉద్యమాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని ఈ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అణిచివేయాలనుకోవడం ఈ రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదు, కేంద్ర ప్రభుత్వమే EWS కింద 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వొచ్చు అని తెలియజేసిన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడానికి బలిజ కాపుల పైన చిత్తశుద్ధి లేదు. మీరు చేస్తున్న ఈ చర్యల కారణంగా రాష్ట్రంలోని కాపు బలిజలు అంతా ఉద్యమిస్తారు అది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. కావున ఆయనని వదిలి పెట్టాలని జనసేన పార్టీ నుంచి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొత్తచెరువు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్, జనసేన నాయకులు బాలా వెంకట్రాముడు, గూడా మధు, పూల రెడ్డప్ప, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way