చేసిన సేవలే గుర్తింపును ఇస్తాయి : జనసేన నాయకులు గురాన అయ్యలు

• గురాన అయ్యలును సత్కరించిన అంజనీపుత్ర చిరంజీవి యువత

• అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ కు అభినందనలు తెలిపిన జనసేన నాయకులు గురాన, ఆదాడ

       విజయనగరం, (జనస్వరం) : ప్రముఖ వ్యాపారవేత్త, జనసేనపార్టీ యువనేత గురాన అయ్యిలు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు కోయ్యాన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో మెగా ఫ్యామిలీ అభిమానులు, స్థానిక ఆర్.టి.సి. కాంప్లెక్స్ వద్దనున్న జి.ఎస్.అర్. హోటల్ లో గురువారం ఉదయం గురాన అయ్యలు ను మర్యాదపూర్వకంగా కలిసి, అయ్యలు ను సత్కరించారు. అలాగే డిసెంబర్ 23, 24తేదీల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ 2022 ముగింపు ఉత్సవాల్లో అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ కు ప్రత్యేకమైన సేవా అవార్డులు రావటంతో జనసేన నాయకులు గురాన అయ్యలు, ఆదాడ మోహనరావు, క్లబ్ అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్, ఉపాధ్యక్షుడు లోపింటి కళ్యాణ్ కు, సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యువనేత అయ్యలు మాట్లాడుతూ అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సేవలు అభిందనందనీయమని, తక్కువ కాలంలో ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుందని, చేసిన సేవలే గుర్తింపును ఇస్తాయని, నడుస్తూ, నడిపిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యము అనే నినాదంతో వాకర్స్ క్లబ్బులు అన్నీ సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముక్కి కుమార్, రెయ్యి రాజు, గుల్లపాటి మోహన్ కుమార్, రాజేష్, పత్రి సాయి, ఎంటి రాజేష్, కందివలస సురేష్, ఆనంద్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way