Search
Close this search box.
Search
Close this search box.

రోడ్డున వదిలేసిన వృద్ధ తల్లిని ఆశ్రమం కల్పించిన గుడివాడ పట్టణ జనసైనికులు

జనసైనికులు

            కృష్ణా ( జనస్వరం ) : గుడివాడ పట్టణ స్థానిక బస్టాండ్ సెంటర్లో ఒక వృద్ధ తల్లి చలితో తీవ్ర ఇబ్బంది పడడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జన సైనికులకు తెలియజేయగా వెంటనే స్పందించిన జనసైనికులు వృద్ధ ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ అందరూ ఉండి చివరి దశలో ఇలా ఒంటరిగా వదిలి వేస్తున్నారని ఈరోజు వీరికి పట్టిన గతే మనకి రేపు ఇదే గతి పడుతుందని తల్లిదండ్రులను దేవుళ్ళు లాగా పూజించుకోవాలి కానీ ఇలా వదిలించుకోవాలని చూడకూడదని తెలియజేశారు. మనకి ఈ మహోతరమైన మానవ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు రుణపడి ఉండాలని చివరి దశలో ఇలా వదిలేయకూడదని పెద్దవారికి వయసు పెరిగే కొద్దీ కొంచెం చాదస్తం కొంచెం కోపం రావడం సహజం అలాగని వీరిని రోడ్డున వదిలేయడం మహా పాపం మీకు అంతగా వృద్ధాప్యంలో తల్లిదండ్రుల వల్ల ఇబ్బందిగా ఉంటే వృద్ధ ఆశ్రమంలో చేర్పిస్తే వాళ్ళు అక్కడ వున్న వృద్ధ మతలతో కలిసి సంతోషంగా జీవిస్తారు అని ఇలాంటివి మళ్లీ పునర్వతం కాకుండా చూడాలని మనవి చేసుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మానవసేవ మాధవ సేవ అనే నినాదంతో ఈ తల్లి చివరి శ్వాస వరకు కొడుకులాగా తోడుగా ఉంటానని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ కరీం, అయ్యప్ప, చరణ్, గంట అంజి, షేక్ మీరా షరీఫ్, శయన నాని గారు, సురేష్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way