గాజువాక నియోజకవర్గంలో గ్రామాల్లో ఓటు హక్కును నమోదు చేయిస్తున్న జనసైనికులు
విశాఖ పట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో 88వ వార్డ్, GVMC, పెందుర్తి, నరవ, కోటి నరవ, సత్తి వాని పాలెం, జగ్గయ్య పాలెం, కాపు జగ్గరాజు పేట, మంగళ పాలెం గ్రామంలో 18 సంవత్సరాలు నిండి ఓటు లేని ప్రజలకు కొత్త ఓటర్ నమోదు కార్యక్రమం 88 వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ వబ్బిన జనార్దన శ్రీకాంత్ వారి ఆధ్వర్యంలో నిరంతరంగా జరుగుతూ సుమారు 1000కు పైగా కొత్త ఓటర్లు నమోదు చేయడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి, రాజకీయ కోణంలో యువత పాత్ర ముఖ్యమని, అలాంటి వారికి ఓటు హక్కు లేక చాలా మంది తమ ఓటు హక్కును కోల్పోతున్నారు. అలాంటి వారికి ఓటు హక్కు గురించి అవగాహన కల్పించి, తద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నామని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆనంద్, శ్రీను, సిరిసిల్ల అప్పారావు, హనుమంత్, రవి, గండ్రెడ్డి అశోక్, గల్లా రమేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.