మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జనసైనికుల రక్తదాన శిబిరం

             జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి  జయంతి సందర్బంగా పవనపుత్ర బ్లడ్ డోనర్స్ మరియు ఎయిమ్ ఫర్ సేవా (AFS) సంయుక్తంగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చిన్నమురహరిపురం గ్రామంలో జెమ్స్ హాస్పిటల్ రాగోలు వారి సౌజన్యంతో రక్తదాన శిభిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిభిరంలో మొత్తం 36 మంది యువకులు పాల్గొని రక్తదానం చెయ్యడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిధిగా వజ్రపుకొత్తూరు మండలం Ex.MPP గోరకల వసంతస్వామి గారు పాల్గొన్నారు. వసంత స్వామిగారు మాట్లాడుతూ ఈ కరోనా కష్టకాలంలో రక్తకొరత చాలా ఉన్న సమయంలో మా సొంత గ్రామం చిన్న మురహరిపురం గ్రామ యువత ముందుకు వచ్చి బ్లడ్ క్యాంపు పెట్టడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. యువత ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చెయ్యాలని పిలుపునిచ్చారు. పవనపుత్ర బ్లడ్ డోనర్స్ సంస్థ వ్యవస్థపాకుల్లో ఒకరైన రేగటి నవీన్ మాట్లాడుతూ ఈ కరోనా కష్టకాలంలో చాలామంది బాధితులు రక్తం అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో పవనపుత్ర బ్లడ్ డోనర్స్ సంస్థ తరుపున బ్లడ్ క్యాంపు నిర్వహించడం చాలా అందంగా ఉంది అన్నారు. ప్రజల్లో రక్తదానంపై ఎన్నో అపోహలు ఉన్నాయని అవన్నీ తొలగించడానికి పవనపుత్ర బ్లడ్ డోనర్స్ సంస్థ ప్రజల్లో అవగాహనా సదస్సులు, రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది అని చెప్పారు. AFS ముఖ్య సభ్యులు ఐనటువంటి గోరకల గోపాల్ గారు మాట్లాడుతూ మా గ్రామంలో యువకులు అందరూ కలిసి ఎయిమ్ ఫర్ సేవా అనే సంస్థ స్థాపించి సేవాకార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో సీజల రక్త కొరత ఉండడం వలన పవనపుత్ర బ్లడ్ డోనర్స్ సంస్థ సహకారంతో బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిభిరంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. పవనపుత్ర బ్లడ్ డోనర్స్ వజ్రపుకొత్తూరు మండలం అడ్మిన్ లండ ఈశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ రక్తదాన శిభిరంలో నేనుకూడా భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. వజ్రపుకొత్తూరు పుండి పరిసర ప్రాంతాలలో ప్రజలకు బ్లడ్ అవసరమైతే 9652549595, 7780205921 సంప్రదించగలరు. ఈ రక్తదాన శిభిరంలో AFS సంస్థ సభ్యలు ఇల్లుమాళ్ల తులసీరావు, గోరకల గోపాలకృష్ణ, అంగ ఢిల్లేశ్వరరావు, ఇల్లుమాళ్ల లోకనాధం, కీళ్ళు వెంకటేష్, ఇల్లుమాళ్ల జోగారావు, పుచ్చ గణేష్, సైని కృష్ణవంశీ, బత్తిన వాసు, దాసరి తులసీరావు, పవనపుత్ర బ్లడ్ డోనర్స్ సభ్యులు మజ్జి భాస్కరరావు, కొర్నానా ధనుంజయ్, ఇప్పిలి ప్రదీప్, లండ ఈశ్వరరావు, జేమ్స్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మహేష్ గారు మరియు స్టాఫ్ మరియు గ్రామ సభ్యలు యువత, పెద్దలు పాల్గొన్నారు.