రైల్వే కోడూరు జనసేన యూత్ ఆధ్వర్యంలో గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

రైల్వే కోడూరు జనసేన యూత్ ఆధ్వర్యంలో గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

                  ఈ రోజు రైల్వే కోడూరు జనసేన యూత్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతి వేడుక జరుపుకోవడం జరిగింది. మొదటిగా టోల్గేట్ వద్ద ఉన్న గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకోవడం జరిగింది. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మాగాంధీ చరిత్ర కీలక ఘట్టమని ఈ సందర్భంగా స్మరించుకోవడం జరిగింది. జనసేన పార్టీ తరపున ఆయన సేవలను స్మరించుకుంటూ వాళ్ల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని వాల ఆశయ సిద్ధి కోసం నవ సమాజ నిర్మాణం కోసం బాధ్యతగా నడుచుకుంటామని సందర్భంగా ప్రతిజ్ఞ పూనడం కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తరువాత భారత దేశ రెండవ ప్రధాన మంత్రిగా పనిచేసిన లాల్ బహుదారి శాస్త్రి గారిని కూడా ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన సేవలను ఆయన స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన రైల్వే కోడూరు యూత్ నాయకులు మర్రి రెడ్డి ప్రసాద్, నగిరి పాటి మహేష్ ,బాలిశెట్టి వెంకటేష్ ,కలిశెట్టి మని ,ముద్ద పోలు మోహన్ కుమార్, మరియు జనసేన మహిళా నాయకురాలు సింగిరి శివమ్మ గారు, తదితరులు పాల్గొన్నారు.