Search
Close this search box.
Search
Close this search box.

రహదారులు, పాడుపడిపోయిన వంతెనలకు మరమత్తులు చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన జనసేన నాయకులు

జనసేన

          రాజంపేట ( జనస్వరం ) : అన్నమయ్య జిల్లా, జాయింట్ కలెక్టర్ గారికి జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ టి.సుండుపల్లి మండలంలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు టి.సుండుపల్లె మండల పరిధిలో రోడ్లు చాలా అద్వాన్నంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా వంతెనలు అక్కడక్కడా పాడుపడిపోయి ఉన్నాయి. దీని వలన వాహనదారులు అనేక ఇబ్బందులు పడటమే కాకుండా, అనేక ప్రమాదాలు కూడా జరుగుచున్నవి. దీని వలన ప్రాణనష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. అన్నమయ్య జల్లా మొత్తం గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు చాలా అధ్వాన్నంగా వున్నాయి. దీని వలన స్కూలు పిల్లలు సకాలంలో స్కూళ్ళకు వెళ్ళలేక, పేషెంట్లు, వృద్ధులు, గర్భిణీలు సకాలంలో ఆసుపత్రులకు పోలేక ఇలా అనేకమంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుచున్నారు. ఈ సమస్యలు పట్ల గతంలో కూడా జనసేనపార్టీ తరపున పలు సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చామని అన్నారు.. కావున తమరు వెంటనే ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకొని యుద్ధప్రాతిపదికన సమస్యలను పరిష్కరించవలసినదిగా కోరుచున్నామని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way