రహదారులు, పాడుపడిపోయిన వంతెనలకు మరమత్తులు చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన జనసేన నాయకులు

జనసేన

          రాజంపేట ( జనస్వరం ) : అన్నమయ్య జిల్లా, జాయింట్ కలెక్టర్ గారికి జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ టి.సుండుపల్లి మండలంలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు టి.సుండుపల్లె మండల పరిధిలో రోడ్లు చాలా అద్వాన్నంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా వంతెనలు అక్కడక్కడా పాడుపడిపోయి ఉన్నాయి. దీని వలన వాహనదారులు అనేక ఇబ్బందులు పడటమే కాకుండా, అనేక ప్రమాదాలు కూడా జరుగుచున్నవి. దీని వలన ప్రాణనష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. అన్నమయ్య జల్లా మొత్తం గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు చాలా అధ్వాన్నంగా వున్నాయి. దీని వలన స్కూలు పిల్లలు సకాలంలో స్కూళ్ళకు వెళ్ళలేక, పేషెంట్లు, వృద్ధులు, గర్భిణీలు సకాలంలో ఆసుపత్రులకు పోలేక ఇలా అనేకమంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుచున్నారు. ఈ సమస్యలు పట్ల గతంలో కూడా జనసేనపార్టీ తరపున పలు సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చామని అన్నారు.. కావున తమరు వెంటనే ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకొని యుద్ధప్రాతిపదికన సమస్యలను పరిష్కరించవలసినదిగా కోరుచున్నామని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way