ఎమ్మెల్యే ఇంటి పట్టాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలు చూపించాలని కలెక్టర్ కు వినతిపత్రం అందించిన జనసేన నాయకులు

జనసేన

       అనపర్తి ( జనస్వరం ) : పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఆరు నెలల క్రితం ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వటం జరిగింది. పట్టాలు పంపిణీ కార్యక్రమంలో నెల రోజుల్లో మీకు ఇళ్ల స్థలాలు చూపిస్తామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆరు నెలలు గడిచిన లబ్ధిదారులకి స్థలం ఎక్కడ ఉందో చూపించలేదని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పెదపూడి మండలం పెదపూడి గ్రామంలో కలెక్టర్ గారు స్పందన కార్యక్రమంలో లబ్ధిదారులకి స్థలం వెంటనే చూపించాలని అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నియోజకవర్గం సమన్వయకర్త రావడ నాగు గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచు మూర్తి గంగ, అడపా వాసు, తిపిరిశెట్టి పనింద్ర, రాజు, పుట్టకొండ రాజు, రవి, సతీష్ సింహాసనం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way