జగనన్న కాలనీలు పెద్ద స్కామ్ లా మారాయి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి వినోద్ రెడ్డి

         నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 198వ రోజున 43వ డివిజన్ దారాల వీధి ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ళు లేని పేదలందరికీ ఇళ్ళు కట్టిస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఊరు చివర బీడు భూములను తమ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల చేత కొనిపించి అధిక ధరలకు విక్రయించి రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడిందని అన్నారు. జగనన్న కాలనీల పేరుతో పనికిరాని పట్టాలను పేదల చేతికిచ్చి ఆ బీడు భూములను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా పేదలకు కట్టివ్వలేదని ఈ స్కామ్ ని ప్రజలందరూ గ్రహించారని అన్నారు. రానున్న ఎన్నికల తర్వాత ప్రజలందరి ఆశీస్సులతో ఏర్పడబోయే పవనన్న ప్రభుత్వంలో ఈ స్కామ్ అంశాలను వెలికితీసి బాధ్యులను శిక్షించి పేదలందరికి ఇళ్ళు కట్టిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way