అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక చేయూత అందించిన జనసేన నాయకులు

జనసేన

           అనపర్తి ( జనస్వరం ) : పెదపూడి మండలం.. గొల్లల మామిడాడ గ్రామంలో అంబేద్కర్ కాలనీ ఎస్సీ పేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో 7వ నెల గర్భిణి స్త్రీ మరియు 70సం. వృద్ధురాలి మరియు కుటుంబం ఒక చిన్న గుడిసెలో అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారు. దురదృష్టవశాత్తు వృద్ధురాలు మరణించి పూర్తిగా మంటల్లో కాలిపోవడం జరిగింది. పూర్తిగా దగ్ధం అయిన ఇల్లు కట్టుబట్టలో మాత్రమే మిగిలి వున్న ఆ కుటుంబానికి విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావుకు తెలియజేశారు. ఆయన ఆదేశాలు మేరకు వారిని వెను వెంటనే పరామర్శించి అనపర్తి నియోజకవర్గం జనసేన నాయకులు రావడ నాగు  10వేల రూపాయలు తక్షణ సాయం చేయడం జరిగింది. మరోమారు జనసైనికులు 10,000 రూపాయిలు సమకూర్చి ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారి చేతులమీదుగా భాదిత కుటుంబానికి అందచేసారు.. ఈ కార్యక్రమంలో ఆర్.నాగు, కళ్యాణ్, అశోక్, అరుణ్ కుమార్, సుంకర బుజ్జి, సోమశేఖర్ & జన సైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way