సూళ్లూరుపేట ఎమ్మెల్యేపై ధ్వజమెత్తిన జనసేన నాయకులు రోసనూరు సోమశేఖర్

రోసనూరు సోమశేఖర్

సూళ్లూరుపేట ( జనస్వరం ) : పెళ్లకూరు మండలం గుర్రపు తోట నుంచి పాలచ్చూరు గ్రామానికి వెళ్లే రోడ్డుని సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు అత్యంత దారుణంగా తయారైందని స్థానిక సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే సంజీవయ్య గారిపై నిప్పులు చెరిగారు. సుమారు 7 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ రోడ్డుని ఒక దశాబ్దం పాటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాసనసభ్యుడు కళ్ళకి కనపడకపోవడం ఆశ్చర్యం వేస్తుందని వాపోయారు. గ్రామాల ప్రజలు అంటే ఈ శాసనసభ్యుడికి చిన్నచూపు మరియు అసలు పట్టదేమో అనిపిస్తుంది అన్నారు. ఈ రోడ్డుమీద ప్రయాణించే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నా ఎవరూ కూడా పట్టించుకోని పరిస్థితి. అభివృద్ధిని గాలికి వదిలేసిన ఈ వైసీపీ ప్రభుత్వం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రతిపక్షాల్ని విమర్శించడం, మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని రెండు చోట్ల ఓడిపోయాడు నాయకుడు కాదు లాంటి చౌకబారు మాటలు వైసీపీ ఎమ్మెల్యే అసమర్ధతకు అద్దం పడుతుంది అని ఎద్దేవా చేశారు. మీ ముసలి ప్రాయంలో సంజీవయ్య యువసేన అని పెట్టుకున్నప్పుడు ప్రజలు ఎలా నవ్వుకున్నారో, జనం కోసం పుట్టిన జనసేన ను రౌడిసేన అంటే ప్రజలు దేనితో నవాల్లో అర్థం కావట్లేదు అంటూ సోమశేఖర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉన్న ఈ ఒక సంవత్సరంలో అయినా గ్రామాభివృద్ధి దిశగా అడుగులు వేయాలని వైసీపీ ఎమ్మెల్యేకి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way