కాలువ నిర్మాణం చేయకపోవడంతో నీట మునుగుతున్నాం

• పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద వాపోయిన ప్రజలు

      నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 190వ రోజున 42వ డివిజన్ కోటమిట్ట కాలువ వీధి ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఈ ప్రాంతంలో కాలువ వెంబడి ఇళ్ళ నిర్మాణాలు కల్గిన ప్రజలు తమ ఆవేదన చెప్పుకుని వాపోయారు. ఇక్కడ నూతన కాలువ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, కానీ నేటికీ నిర్మాణ పనులు చేపట్టకపోవడం వల్ల మరియు పాత కాలువని పూడికతీత తీయించకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికి కూడా తమ ఇళ్ళు నీట మునిగి బయటకు కదలలేక నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి, స్థానిక వైసీపీ నాయకులకు తమ బాధని ఎన్నిసార్లు చెప్పుకున్నా పరిష్కారం లభించట్లేదని అన్నారు. వారి సమస్యను సావధానంగా విన్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఈ సమస్యని సంబంధిత అధికారుల దృష్టికి స్థానిక జనసేన నాయకులు తీసుకెళ్తారని, వారు పరిష్కరించని పక్షంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలవబోయేది తామేనని, దగ్గరుండి ఈ సమస్యని పరిష్కరిస్తానని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way