కర్నూలు జిల్లాలో పాలకులు మారిన వలసలు మాత్రం ఆగడం లేదు : ఎరుకుల పార్వతి

ఎరుకుల పార్వతి

        ఆదోని ( జనస్వరం ) : ఉపాధి పని చూపడంలో అధికారులు విఫలమయ్యారని జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి అన్నారు. ఉన్న ఊర్లో ఉపాధి లేకపోవడంతో పొట్ట చేతపట్టుకుని ఇతర పట్టణాలకు నగరాలకు తరలిపోతున్నారు. ముఖ్యంగా ఆదోని డివిజన్లోనే కోసిగి ఎమ్మిగనూరు మంత్రాలయం ఆలూరు హోళగుంద కోడుమూరు మండలాల నుంచి ఈ ఏడాది కూడా వలసలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ బెంగళూరు గుంటూరు ముంబైలకు తరలి వలస వెళుతున్నారు. కొంతమంది వారి పిల్లలను కూడా తీసుకుని వెళుతున్నారు. మండలాల్లో స్థానికంగా పనులు లేకపోవడంతో ఉపాధి కోసం దూర ప్రాంతాలకు పట్టణాలకు వలస వెళుతున్నారన్నారు. అధికారులు మాత్రం వలసలు వెళ్ళవద్దు గ్రామాల్లో ఉపాధి పనులు కల్పిస్తామని చెబుతున్నారే తప్ప పూర్తిస్థాయిలో వలసలు నివారించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తపరిచారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లోని ఉపాధి కల్పించే వలసలు నివారించాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way