వైసీపీ ప్రభుత్వానివి నవరత్నాలు కాదు రంగురాళ్లు : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి

     ధర్మవరం, (జనస్వరం) : జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే మీ పార్టీలో మీకు మార్కులు వేస్తారని ఏమైనా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారా అలాంటి ఉద్దేశం ఏమైనా ఉంటే మానుకోమని హెచ్చరించి జగనన్న కాలనీలు సందర్శించడానికి మీరు వస్తారా! మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు వస్తారా! రండి కాలనీలను సందర్శించి మీ అవినీతిని బయటపెడదామని అలాగే 170 స్థానాల్లో గెలవడం కాదు డిపాజిట్లు కూడా రావని మీది నవరత్నాలు కాదు రంగురాళ్ళని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రామాంజనేయులు, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు,కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు పేరూరు శ్రీనివాసులు, కోటికి రామాంజి, బండ్ల చంద్రశేఖర్, దాడితోట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way