Search
Close this search box.
Search
Close this search box.

టిడ్కో గృహాల నిర్మాణాల అవతవకలపై అధికారులకు వినతిపత్రం అందించిన వినుతాకోట

వినుతాకోట

               శ్రీకాళహస్తి ( జనస్వరం ) : రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ శ్రీకాళహస్తి నియోజకవర్గ డి.ఈ శేషగిరిని కలిసి వినతిపత్రం అందించిన నియోజకవర్గ జనసేన ఇంఛార్జి మంత్రి వినుత కోటా. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చేపట్టిన జగనన్న ఇళ్లు, పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమం నియోజకవర్గంలో నిర్వహించి జగనన్న కాలనీలు, టిడ్కో గృహాల నిర్మాణాన్ని క్షేత్ర స్థాయిలో సోషల్ ఆడిట్ చేసిన అంశాలను డి.ఈ గారికి వివరించి, అక్కడ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని, కాంట్రాక్టర్లు చేస్తున్న అవినీతి, పేద ప్రజలు ఇళ్ళ నిర్మాణానికి పడుతున్న ఇబ్బందులు, నిర్మాణ క్వాలిటీ గురించిన విషయాలు వివరించడం జరిగింది. నియోజవర్గంలోని 4 మండలాల్లోని గృహ నిర్మాణ పురోగతి అధికారిక లెక్కలను వివరించాలని కోరడం జరిగింది. నియోజకవర్గం మొత్తానికి దాదాపు 12,000 ఇళ్లు నిర్మాణం కొరకు మంజూరు చేస్తే 150 వరకు మాత్రమే ఇళ్లు నిర్మాణం 4 మండలాలలో మరియు శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో పూర్తి అయినట్లు, ఊరందూరు సమీపంలోని జగనన్న కాలనీలో 4,500 ఇళ్లకు 8 ఇళ్లు, రాజీవ్ నగర్ నవరత్నాల గుడి వద్ద ఉన్న కాలనీలో కేవలం 4 ఇళ్లు మాత్రమే పూర్తి అయినట్లు డి.ఈ గారు తెలిపారు. ముఖ్య మంత్రి గారు జూన్ కళ్ళ మొదట విడత పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించడం జరిగింది. తప్పకుండా దృష్టికి తీసుకుని వచ్చిన అన్ని అంశాలను పరిశీలించి క్షేత్ర స్థాయిలో జరిగే అవకతవకలకు సరిదిద్దుతామని తెలిపారు. వీలైనంత త్వరలో ప్రత్యేక అధికారులను ప్రతి కాలనీ దగ్గర నియమించి, పర్యవేక్షించి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని డి.ఈ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పాల గోపి, నాయకులు రవి కుమార్ రెడ్డి, మణికంఠ, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way