క్యాన్సర్ బాధితుడిని పరామర్శించిన అరకు జనసేన నాయకులు

    అరకు, (జనస్వరం) : అరకు నియోజకవర్గం కేంద్రంలో చిన్నలబుడు పంచాయతీ పరిధిలో గల పకనకుడి గ్రామంలో  జనసేన పార్టీ బృందం ఆధ్వర్యంలో ఆయా గ్రామంలో పర్యటించి ముందుగా క్యాన్సర్ తో బాధపడుతున్న స్వాబి సోమను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడిని పూర్తి వివరాలు అడగగా తనకు క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. ఆర్థిక స్తోమత లేకపోవడం వలన ప్రభుత్వం స్పందించకపోవడం వలన ఏమి చేయలేని ఈ పరిస్థితుల్లో ఇంటికి పరిమితం అవ్వవలసింది వచ్చిందని బాధితుడు తెలిపారు. దీనిపై స్పందించిన జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా, మాదల శ్రీరాములు, అల్లంగి రామకృష్ణ, ఎల్బి రవీంద్ర తదితరులు బాధితుడికి భరోసనిస్తూ వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్ లో వైద్యం కోసం బాధ్యత తీసుకొని మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా మా వంతు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై జనసేన మాటలు జనసేన సిద్ధాంతాలు క్లుప్తంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way