బలివే గ్రామంలో తమ్మిలేరు మీద బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలి : నూజివీడు జనసేన నాయకులు పాశం నాగబాబు

          నూజివీడు, (జనస్వరం) : ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలో ముసునూరు మండల పరిధిలోని బలివే గ్రామంలో ఎన్నో ఏళ్ల నుండి తమ్మిలేరు నది మీద ప్రయాణికులకు, ఇతర ప్రాంతాల నుండి బలివే రామస్వామి వారి క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు గురికావడం, అలానే ప్రధాన రహదారికి విద్యార్థులు, ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని నిత్యం అదే ప్రవాహం దాటి వెళ్తున్న సందర్భంలో గతంలో గ్రామస్తులు అనేక సార్లు ఈ సమస్య గురించి అధికారులకు ప్రజా ప్రతినిధులకు అర్జీలు పెట్టిన పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇసుక మాఫియా మీద పెట్టే శ్రద్ద ప్రజల సమస్యల మీద పెట్టాలని ముసునూరు ఎంపిడివోకి నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు అధ్వర్యంలో బలివే గ్రామ యువతతో కలిసి స్థానిక నాయకులతో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు చేబత్తిన విజయ్, గిరి గోపికృష్ణ, యాదల మహేంద్ర, రాము, చేకూరి అనిల్, బయ్యం సతీష్, రాజబోయిన సుబ్బు యాదవ్, కేశవ, యలబాక నరసింహ తదితరుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way