రాజోలులో జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఏసుబాబు ఆర్థిక సహాయంతో ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ

         రాజోలు ( జనస్వరం ) : నియోజకవర్గం రాజోలు మండలం, శివకోటి గ్రామంలో బొంతు రాజేశ్వరరావు  ఆధ్వర్యంలో మేకల వీర వెంకట సత్యనారాయణ మూర్తి (ఏసుబాబు) ఏర్పాటు చేసిన ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మేకల ఏసుబాబు గారు తన సొంత డబ్బుతో ఉచిత వైద్య కంటి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎవరికైతే కంటికి సంబంధించి ఇబ్బందులు ఉన్న 50 మందికి కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మానవతా దృక్పథంతో సేవే లక్ష్యంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసిన మేకల ఏసుబాబు గారిని అభినందిస్తున్నామని జనసేన నాయకులు అన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Facebook