Search
Close this search box.
Search
Close this search box.

విజయనగరంలో నేను నా నియోజకవర్గం ప్రజలు – 30 వ రోజు

విజయనగరం

         విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధనలో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం ఇంఛార్జి  పాలవలస యశస్వి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పాదయాత్ర “నేను నా నియోజకవర్గ ప్రజలు” కార్యక్రమం ఎంతో విజయవంతంగా దూసుకు వెళుతూ 30 రోజులు పూర్తయింది. జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారు, మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. జనసేన నాయకులు, వీరమహిళలు మరియు కార్యకర్తలు తోడు రాగా, విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి ఆశీర్వాదములతో అదేరోజు పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటివరకు విజయనగరం లోని 6 డివిజన్లు మరియు 6 గ్రామాలలో ఎంతో విజయవంతంగా పాదయాత్ర పూర్తిచేశారు. అన్ని వర్గాల ప్రజలనుంచి మద్దతు లభించింది. ప్రతీ కార్యకర్త కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అధికార వైసీపీ మరియు ప్రతిపక్ష టీడీపీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలను ఎంత బెదిరించినా, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో, అదే ఉత్సాహంతో ప్రతి కార్యకర్త, నాయకులు మరియు వీరమహిళలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way