Search
Close this search box.
Search
Close this search box.

గుంటూరు జనసేనపార్టీలోకి చేరికలు

గుంటూరు

        గుంటూరు ( జనస్వరం ) : గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు మహిళా కోఆర్డినేటర్ పార్వతీ నాయుడుల సమక్షంలో పప్పుల వరలక్ష్మి ఆధ్వర్యంలో పలువురు వీర మహిళలు నూతనంగా పార్టీలో చేరటం జరిగింది. వారికి జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ… మా పార్టీ రోజు రోజుకీ ప్రజల ఆదరణ పొందుతుందని అనటానికి ఇదే నిదర్శనం. ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన పప్పుల వరలక్ష్మికి అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మా పార్టీకి వీర మహిళలే వెన్నెముకగా ఉండి పార్టీని ముందుండి నడిపించాలని ఆశిస్తున్నాను. మా పార్టీ ఎలాంటి పిలుపునిచ్చిన ఆ కార్యక్రమాలను ముందుండి నడిపించే వీరమహిళలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. భవిష్యత్ తరాలకు మా వీరమహిళలు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటారని గర్వంగా చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులుగా అడపా మాణిక్యాల రావు, నాగదాసు రామచంద్ర ప్రసాద్, కార్పొరేటర్ పద్మావతి వీరమహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way