అమలాపురం నియోజకవర్గములో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

      అమలాపురం, (జనస్వరం) : జనసేన పార్టీ ఐటీ విభాగం అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పలచోళ్ళ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు అమలాపురం నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్లు, ముఖ్య నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇంఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రతి క్రియాశీలక సభ్యుడు జనసేనపార్టీ అస్త్ర యాప్ డౌన్లోడ్ చేసుకుని పార్టీ కార్యక్రమాలు వీక్షించే విధంగా చూడాలని, అదేవిధంగా నా సేన కోసం –  నా వంతు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ ఐటి కోఆర్డినేటర్ పలుచోళ్ళ వేణు, జిల్లా కో-ఆర్డినేటర్ గాలిదేవర తామేష్ కోరారు. అగ్నికులక్షత్రియుల సమస్యలపై మంగళవారం 4వ తేదీ అమలాపురం గడియార స్తంభం నుండి కలెక్టరేట్ వరకు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వందలాదిగా అగ్నికుల క్షత్రియులు, జనసైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా అగ్నికుల క్షత్రియుల సమస్యలపై ముద్రించిన కరపత్రాన్ని నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఎంపీటీసీలు రాష్ట్ర, జిల్లా నాయకులు, వీర మహిళలు, క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించిన పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way