Search
Close this search box.
Search
Close this search box.

కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో దీన్ దయాల్ నగర్ లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ :

కేతంరెడ్డి వినోద్ రెడ్డి

          నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 138వ రోజున 3 వ డివిజన్ దీన్ దయాల్ నగర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన జెండాను ఘనంగా ఆవిష్కరించిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి, అనంతరం వారు ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు ముగియగానే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం తధ్యమని, అందుకు అంకురార్పణ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండే మొదలైందని అన్నారు. ఏ ఇంటి తలుపు తట్టినా తమను అపూర్వంగా ఆదరిస్తున్నారని అన్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలు చేస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు.. జీవన్, చిన్నా, మస్తాన్, పెంచలయ్య, హేమంత్ రాయల్, కుక్క ప్రభాకర్, కార్తిక్, వరప్రసాద్, దివాకర్,వినయ్, ఈశ్వర్, చరణ్, సాయి, ఇతర కార్యకర్తలు వీరమహిళలు శిరీష రెడ్డి, ఝాన్సీ, శశిరేఖ, లలిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way