పేదోడి, కార్మికుల, కూలీల, ఉసురు తగలడం ఖాయం : జనసేన నాయకులు

జనసేన

           విజయనగరం ( జనస్వరం ) : జనంలోకి జనసేన కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, మరియు విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) గురువారం కంటోన్మెంట్ గణేష్ కోవెల కూడలిలో నిర్వచించారు. ముందుగా భవన నిర్మాణ కార్మికులకు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రజలపక్షాన నిలబడి చేస్తున్న ప్రజాసేవ వివరాలతో కూడిన కరపత్రాలు, జగన్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలతో కూడియున్న కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ ఒక్క అవకాశం అని జగన్ రెడ్డి అందలమెక్కి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజానీకానికి రోడ్డున పడేసారాని, ఆఖరికి కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక, ఉత్తరాంధ్ర నుంచి పొరుగురాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారని, ఖచ్చితంగా రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల ఉసురు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగులుతుందని దుయ్యబట్టారు. గతప్రభుత్వాల పనితీరును చూసారు గనుక, ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రకలపక్షాన నిలబడి అన్నివిధాల సహాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ కు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు దంతులూరి రామచంద్ర రాజు, పార్టీ యువ నాయకులు లోపింటి కళ్యాణ్, సీరకుమార్, పత్రి సాయి, బంగార్రాజు, భాస్కర రావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way