Search
Close this search box.
Search
Close this search box.

అంగన్వాడి కేంద్రాల అలసత్వంపై MRO కి వినతిపత్రం అందజేసిన గోరంట్ల జనసేన నాయకులు

     గోరంట్ల, (జనస్వరం) : గోరంట్ల మండలం అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు గర్భవతులకు చిన్నపిల్లలకు కాలంచెల్లిన, గుడ్లు పాలు పంపిణీ చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జనసేనపార్టీ తరఫున MRO కి వినతి పత్రం అందించడం జరిగింది. తదనంతరం నాయకులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా గోరంట్ల మండలంలో వివిధ అంగన్వాడీ కేంద్రాలలో చెడిపోయిన గుడ్లు పంపిణీ చేస్తున్న కూడా ప్రభుత్వ అధికారులు గానీ, ప్రభుత్వ పెద్దలు గానీ పట్టించుకోవడం చాలా దుర్మార్గమైన చర్యని తెలిపారు. అలాగే శిశు సంక్షేమ శాఖ మంత్రి సొంత జిల్లాలో ఇలా జరగడం వాటిని పట్టించుకోవడం కానీ ఆ కాంట్రాక్టర్స్ పైన చర్య తీసుకోవడం గానీ ఇంత వరకు జరగలేదు అంటే అధికారులు గానీ ప్రభుత్వం గానీ గర్భవతులు, పిల్లల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, నియోజకవర్గ నాయకులు అనిల్ కుమార్, మండల నాయకులు సంతోష్, IT పెనుకొండ నియోజకవర్గ కో ఆర్డినేటర్ యోగనంద రెడ్డి, నాయకులు రాఘవ, బాబర్, బాబా, నాగేష్, బాలు, శంకర, పులేరు అనిల్ ,గౌతమ్, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way