నెల్లూరు సిటీలో కేతంరెడ్డి సమక్షంలో జనసేన పార్టీలోకి నూతన చేరికలు

నెల్లూరు

        నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గం 11వ డివిజన్ నుండి శ్రీమత్రి జోరెపల్లి విజయారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అఖిల్ రెడ్డి, సాయి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి సమక్షంలో 50 మంది పార్టీలో నూతనంగా చేరడం జరిగింది. వీరికి పార్టీ కండువాలు కప్పిన కేతంరెడ్డి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 126వ రోజున 50వ డివిజన్ సంతపేట ప్రాంతంలో పాల్గొని ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే లక్ష్యంతో జరుగుతున్న పవనన్న ప్రజాబాటని అపూర్వంగా ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి భావజాలాలు నచ్చి పార్టీలో చేరడానికి అనేకమంది ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. నేడు పార్టీలోకి చేరిన వారిలో అధికమంది వీరమహిళలు ఉండడం శుభపరిణామమని అన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని, రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేతంరెడ్డి పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way