పెడబల్లిలో ఘనంగా జనసేనపార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం

పెడబల్లి

       పుట్టపర్తి ( జనస్వరం ) : పుట్టపర్తి నియోజకవర్గం కేంద్రంలోని పెడబల్లి మేజర్ పంచాయితీలో జనసేనపార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  చిలకం మధుసూదన్ రెడ్డి, రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు జయరామి రెడ్డి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళి, ప్రధాన కార్యదర్శిలు  పత్తి చంద్రశేఖర్, బొబ్బరం శ్రీనివాస్, అబ్దుల్ జనసేన జెండా ఆవిష్కరణ చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.  అనంతరం జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి పలువురు యువకులు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి పార్టీ నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వెంకటేష్ నాయక్, శ్యాంసుందర్, పుట్టపర్తి మండల కన్వీనర్ పెద్దన్న, కొత్తచెరువు మండల కన్వీనర్ పూల శివప్రసాద్, గిరి, నందీస్, కృష్ణ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సంజీవ రాయుడు, సురేష్, అనంతపురం నగర కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, ఒడిసి మండల కన్వీనర్  మేకల ఈశ్వర్, అనంతపురం రూరల్ కన్వీన గంటా రామాంజనేయులు, వీర మహిళలు జనసేన నాయకులు జన సైనికులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way