వాటంబేడు గ్రామంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

వాటంబేడు

       తిరుపతి ( జనస్వరం ) : తిరుపతి జిల్లా తడ మండలం వాటంబేడు గ్రామం లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తడ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు సిరివేటి రమణ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జనసేన కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేసి అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ 2024 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి అంటూ జన సైనికులు నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కృపా సాగర్, యల్లంపాటి రిషి, ముని శేఖర్, దశరథ్, రాజేంద్ర, గణపతి, దిలీప్, మురళి కృష్ణా రెడ్డి, వెంకటేశ్వర్లు, ముని కుమార్, బాల రాజు, సుబ్బు, వెంకయ్య, అశోక్, పోలయ్య, సుధీర్ , అజిత్, మహేంద్ర మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.

See also  250 రోజుకి చేరిన పవనన్న ప్రజాబాట : కేతంరెడ్డి వినోద్ రెడ్డి