మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో నా సేన కోసం – నా వంతు భారీ ర్యాలీ

    చిత్తూరు, (జనస్వరం) : రాజకీయాలలో అవినీతి అంతం చేయాలనే లక్ష్యంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన క్రౌడ్ ఫండింగ్ కు‌ ప్రజలంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా పార్లమెంటరీ సమన్వయ కర్త మైఫోర్స్ మహేష్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మైఫోర్స్ మహేష్ ఆద్వర్యంలో పట్టణంలో నాసేన కోసం నా వంతు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు యువకులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ పార్టీ క్రౌడ్ ఫండింగ్ పై రాష్ట్ర స్దాయి కమిటీలో మైఫోర్స్ మహేష్ కు కీలక భాద్యతలు అప్పగించారని వివరించారు. రాష్ట్ర స్దాయిలో తనకు అప్పగించిన భాద్యతలు పూర్తి చేసి చిత్తూరు జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తానని ప్రకటించారు, సుమారు 300 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమరనారాయణ, వీర మహిళలు మల్లిక, జనసేన పార్టీ నాయకులు గొల్లపల్లె భాస్కర, మహేంద్ర గౌడ్, రామ్మూర్తి మహిళా నాయకురాలు మల్లికా శోభ అయాజ్, నరేష్, మనోజ్, సోను, నాగేంద్ర పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way