నిబద్దత గల ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాం : జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు

    గుంటూరు, (జనస్వరం) : కష్టనష్టాలకోర్చి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తున్న జనసైనికులకు అండగా ఉంటానని గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె అన్నారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల జనసైనికుడు క్రియాశీలక కార్యకర్తయిన క్రోసూరి శ్రీకాంత్ ఇటీవల ద్విచక్రవాహనం ప్రమాదానికి గురై భుజానికి తీవ్ర గాయమైంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు వెంటనే కేంద్ర కార్యాలయనికి సమాచారం అందించి ఇన్సూరెన్స్ చెక్ త్వరగా వచ్చేలా కృషి చేసారు. ఈ రోజు జిల్లా అధ్యక్షులు చేతులు మీదుగా క్రోసూరి శ్రీకాంత్ కు 50 వేల రూపాయల చెక్ ను అందజేశారు. వారికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నారదాసు ప్రసాద్, జిల్లా మీడియా అధికారప్రతినిధి తవిటి భావన్నారాయనణ, జిల్లా కార్యదర్శిలు అంబటి మల్లి, కాశిం, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ మునగా వెంకట్, మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, దాచేపల్లి మండల అధ్యక్షుడు మండపాటి దుర్గారావు, తోట నరసయ్య, మాజీ సర్పంచ్ ద్రోణాదుల అంకారావు, సిరిగిరి మణికంఠ జన సైనికులు, వీరమహిళలలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way