● అప్పుడే చట్టం మీద నమ్మకం కలుగుతుంది
● మర్డర్ లు చేసే వారికీ వంత పాడే సంస్కృతి పోవాలి
● ఎస్పీని కలిసి వినతిపత్రం అందించిన జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న
తిరుపతి, (జనస్వరం) : తిరుపతి ఎస్పీని గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు న్యాయం న్యాయం జరగాలని తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్వేటి నగరం మండలం గాజంకి గ్రామ వాసి పద్మావతి పురంలో తాత్కాలికంగా నివాసమున్న భీమయ్యను చంపి, ఉరికి వేలాడదీసిన భార్యను, అత్తను, బావమరిదిని, మరదలి భర్తను విచారించి, వారికి జీవిత ఖైదీలుగా శిక్ష వేయాల్సిందిగా, అప్పుడే చట్టం పట్ల గౌరవం పెరుగుతుందని, అబాగ్యులైన వారికీ న్యాయం జరుగుతుందని, దీనికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న భీమయ్య కుమార్తె కోకిలను విచారించి వారిమీద చర్యలకు ఉపక్రమించాలని, మర్డర్ లు చేసే వారికీ వంత పాడే సంస్కృతి పోవాలని తెలియజేశారు. భీమయ్య తమ్ముడితో కలిసి తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి స్పందనలో తెలియజేశారు.