రైతు కష్టం.. వర్షార్పణం.. గొల్లప్రోలు బైపాస్ రోడ్ వద్ద నీట మునిగిన వరిచేలు. ఆదుకోవాలని కోరుతున్న జనసైనికులు

రైతు కష్టం.. వర్షార్పణం.. గొల్లప్రోలు బైపాస్ రోడ్ వద్ద నీట మునిగిన వరిచేలు. ఆదుకోవాలని కోరుతున్న జనసైనికులు

            పిఠాపురం, చేబ్రోలు, గొల్లప్రోలులో  తరాలు మారినా మన పాలకుల అశ్రద్ధ వల్ల మరలా మునిగిన పంట పొలాలు.. గత ఏడాది జరిగిన పంట నష్టం కి ఇప్పటివరకు పరిహారం అందలేదు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పందించి గత ఏడాది లాగ ఫొటోస్ తీసుకుని గాలికి వదిలేయకుండా బాధిత రైతులకు న్యాయం చేస్తారు అని ఆశిస్తున్నామని గొల్లప్రోలు జనసైనికులు అన్నారు.  మునిగిపోయిన పంట పొలాలు సమస్యకు ప్రధాన కారణం రాజకీయ నాయకులు చేసే తప్పులు వలన ప్రభుత్వ అధికారులు తప్పులు వలన, గత 20 సంవత్సరాల నుంచి పంటకు సంబంధించిన కాలువలు తవ్వకాలు జరగక వాటి మీద చర్యలు తీసుకోవడం లేదు. ఈ ప్రభుత్వం అయిన ఫోటోలుకి పరిమితం కాకుండా ఈ పంట కాలువల మీద చర్యలు తీసుకుని  నష్టపోయినరైతులకుపరిహారం అందచేయాలని కోరుతున్నాము అన్నారు జనసైనికులు.