ప్రకటించిన మద్దతు ధరకు ధ్యాన్యంను రైతుల వద్ద వెంటనే కొనుగోలు చేయాలంటూ జనసేన, బీజేపీ సంయుక్త ధర్నా

ప్రకటించిన మద్దతు ధరకు ధ్యాన్యంను రైతుల వద్ద వెంటనే కొనుగోలు చేయాలంటూ జనసేన, బీజేపీ సంయుక్త ధర్నా

            గత 15 రోజులుగా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది అధికారులు ప్రజా ప్రతినిధులు కలెక్టర్ గారు గిట్టుబాటు ధర 15600 అని ప్రకటనలు చేస్తున్నారు గాని 6000 నుంచి 8000 రూపాయలు కూడా వారికి అందట్లేదు. మిల్లర్లు దళారులు రైతులను మోసం చేస్తున్నారు 8 వేల రూపాయల లోపు రైతుల వద్ద కొని బిల్లింగ్ మరియు అమ్మకాలు 15000 చేస్తున్నారు. గవర్నమెంట్ ఆడిట్ చేసి 15 వేల రూపాయలు రైతులకు అదేవిధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతుల నేరుగా వెళ్లి ప్రశ్నించగా సరైన సమాధానం దొరకటం లేదు. ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధులు ఫోన్ లో అందుబాటులో లేకపోవడం కరోనా సాకుతో తప్పించుకొని తిరగడం చేస్తున్నారు. నిన్నటి రోజున రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తాళం వేసి తమ ఆవేశాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం పరిచారు. రాబోయే రోజుల్లో రైతులు ప్రభుత్వంపై ప్రతిఘటించే రోజు వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టి రైతులకు మద్దతు ధరకు ధాన్యం కొనే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు మరియు కౌలుదార్లకు నష్టపరిహారం అందించే విధంగా సహాయక చర్యలు చేపట్టాలి అని జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నాము అని జనసేన నాయకుడు  కిషోర్ తెలియజేసారు. జనసేన పార్టీ నుంచి గునుకుల కిషోర్, డాక్టర్ అజయ్, శ్రీకాంత్, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, సుల్తాన్ భాష, బోనుబోయిన ప్రసాద్, షాజహాన్ సాయి తేజ జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, బిజెపి జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ నారాయణరెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు మిడతల రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు.