భావి ఉపాద్యాయులుని ఆదుకోరా? టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్

భావి ఉపాద్యాయులుని ఆదుకోరా? టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్

                 రాష్ట్రంలోని 500 డైట్ కళాశాలలో 2018-2020 విద్యా సంవత్సరంకు సంబంధించి సుమారు 35,000 మంది విద్యార్థులు డైట్ మేనేజ్మెంట్ కోటాలో చదువుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ఈ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని టెక్కలి జనసేన పార్టీ ఇంచార్జ్ కణితి.కిరణ్ గారు తెలిపారు. ముందుగా పలు కళాశాలలో యాజమాన్య కోటా క్రింద వేలాది రూపాయలు ఫీజు రూపంలో కట్టించుకొని పరీక్షలు వ్రాయబోయే తరుణంలో ఈ నెల 28 తేదీ నుంచి పరీక్షలు అనగా ఇప్పుడు యాజమాన్య కోటా విద్యార్థులకు పరీక్షలు వ్రాయటకు అనుమతి లేదని ప్రభుత్వం చెప్పడం తో విద్యార్థుల యొక్క విలువైన 2 ఏళ్ల విద్యా సంవత్సరాన్ని కోల్పోవలసి రావడం దారుణమైన విషయం అని, విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచించి G.O.30(2015) ని సరళీకృతo చేసి భావి ఉపాద్యాయుల భవిష్యత్ ని కాపాడాలని,G.O. ని అతిక్రమించి నిబంధనలు ను తుంగలో తొక్కిన కళాశాల యాజమాన్యం పై తగు కఠినమైన చర్యలు తీసుకోవాలని కణితి.కిరణ్ డిమాండ్ చేశారు.