G+3 హౌసెస్ అసంపూర్ణ నిర్మాణం కారణంగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్న ప్రభుత్వం : లక్ష్మణ కుటాల

లక్ష్మణ కుటాల

         కదిరి ( జనస్వరం ) : పేద, మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన మంత్రి ఆశాస్ యోజన కింద నిర్మించిన G+3 హౌసెస్ అసంపూర్ణ నిర్మాణం కారణంగా ప్రజాధనాన్ని వృదా చేసి కాలయాపన చేస్తున్నారని జనసేన జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల ఆవేదన వ్యక్తం చేశారు. కదిరి మునిసిపల్ పరిధిలో నిర్మించిన TIDCO ఇళ్ళ నిర్మాణం పనులు సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు మోక్షం ఎప్పుడు కలిగిస్తారని లబ్ది దారులు ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల నిర్లక్ష్యమా..?? లేక అధికారుల నిర్లక్ష్యమా..?? పేద ప్రజల సొంత ఇంటి కల కలగానే మిగిలిపోవాల్సి వస్తుంది. గతంలో లబ్ది దారుల దగ్గర ఇళ్ళ కేటాయింపు కోసం (లాటరీ పద్దతిలో ) డబ్బులు కూడా వసూలు చేశారు. మునిసిపల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి దారులు మాత్రం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా ఇళ్లను కేటాయిస్తామని చెప్తున్నారు. గతంలో పేద మధ్యతరగతి ప్రజలు దగ్గర వసూలు చేసిన డబ్బులు తిరిగి వెనక్కి ఇచ్చి, G+3 ఇళ్ళ నిర్మాణం తొందరగా పూర్తి చేసి పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కళను తొందరగా తీర్చాలని కదిరి జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నాము అని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way