భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం

           భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ జన్మదినం సందర్భంగా నిర్వహించే సేవా సప్తాహంలో భాగంగా రెండవ రోజు మంగళవారం భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళవెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణంలోని శ్రీహరి చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమం వృద్ధులకు, మరియు ముచ్చు మిల్లి రోడ్డు నందున వికలాంగుల ఆశ్రమంలో పిల్లలకు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు , బిజెపి పట్టణ అధ్యక్షులు కొట్టువాడ హరిబాబు, పలివెల రాజు అవసరాల వెంకటరమణమూర్తి ఆకేటి శ్రీ కృష్ణ యాండ్రబుల్లబ్బులు, గుర్రాల సత్యనారాయణ సోమసానిఆంజనేయులు సత్యవాడ శ్రీహరి పంతులు పి. కేశవ రాఘవేంద్రరావు, కోలా అప్పారావు, గుబ్బలశ్రీనివాసు మరియు జనసేన పార్టీ నాయకులు బుంగరాజు, అంకం శ్రీనివాస్, రొక్కాల సత్తిబాబు, దేవ్ పట్టాభి, పోలిశెట్టి శ్రీనివాసు మద్దా ప్రసాద్ తదితరులు రామచంద్రపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించి కార్యక్రమం జయప్రదం చేసినారు.