Search
Close this search box.
Search
Close this search box.

మాట తప్పని, మడమ తిప్పని, నిద్దుర పోయిన ముఖ్యమంత్రికి శుభోదయం పలుకుదాం : త్యాడ రామకృష్ణ

త్యాడ రామకృష్ణ

        విజయనగరం ( జనస్వరం ) : రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై మరోసారి జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా విజయనగరం నియోజకవర్గంలో రోడ్లపై ఉన్న పాడైపోయిన గుంతలను ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రతీ జనసైనికులు ఈ నెల 15,16,17 తేదీల్లో #GoodMorningCMSir అని వ్రాసి పోస్ట్లు పెట్టాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) గురువారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. గతనెల ముఖ్యమంత్రి నిర్వహించిన మున్సిపల్ అధికారుల సమీక్షలో ఈ జులై నెల 15 నాటికి రోడ్లపై గుంతలు ఉండవని మీడియా ముఖంగా ప్రకటన ఇచ్చారు. ఈ మాటతప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్లు గుంతలు పూడుస్తామన్న సంగతి మరిచారని, నిద్దుర పోయిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కి ఈ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా సోషల్ మీడియా దద్దరిళ్ళేటట్లు తట్టిలేపాలని అన్నారు. విజయనగరం నియోజకవర్గంలోను, పట్టణంలోనూ రోడ్ల పరిస్థితి మరింత అద్దువానంగా మారిందని,ప్రజలంతా తీవ్రఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తోందని, జనసేన పిలుపుతో ఈసారి ప్రతీజనసైనుకులు ప్రభుత్వానికి మేలుకొలపాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way