మాట తప్పని, మడమ తిప్పని, నిద్దుర పోయిన ముఖ్యమంత్రికి శుభోదయం పలుకుదాం : త్యాడ రామకృష్ణ

త్యాడ రామకృష్ణ

        విజయనగరం ( జనస్వరం ) : రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై మరోసారి జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా విజయనగరం నియోజకవర్గంలో రోడ్లపై ఉన్న పాడైపోయిన గుంతలను ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రతీ జనసైనికులు ఈ నెల 15,16,17 తేదీల్లో #GoodMorningCMSir అని వ్రాసి పోస్ట్లు పెట్టాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) గురువారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. గతనెల ముఖ్యమంత్రి నిర్వహించిన మున్సిపల్ అధికారుల సమీక్షలో ఈ జులై నెల 15 నాటికి రోడ్లపై గుంతలు ఉండవని మీడియా ముఖంగా ప్రకటన ఇచ్చారు. ఈ మాటతప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్లు గుంతలు పూడుస్తామన్న సంగతి మరిచారని, నిద్దుర పోయిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కి ఈ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా సోషల్ మీడియా దద్దరిళ్ళేటట్లు తట్టిలేపాలని అన్నారు. విజయనగరం నియోజకవర్గంలోను, పట్టణంలోనూ రోడ్ల పరిస్థితి మరింత అద్దువానంగా మారిందని,ప్రజలంతా తీవ్రఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తోందని, జనసేన పిలుపుతో ఈసారి ప్రతీజనసైనుకులు ప్రభుత్వానికి మేలుకొలపాలని అన్నారు.

See also  మైనార్టీల ద్రోహి వైఎస్ జగన్ : విజయవాడ నగర అధికార ప్రతినిధి సయ్యద్ అబ్దుల్ నజీబ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి