మన రోడ్డు – మన హక్కు నినాదంతో జనసైనికులు వినూత్న నిరసన

     పెనుగొండ, (జనస్వరం) : పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండ మండలం రామన్నపాలెంలో ఎంపీటీసీ మోఖమాట్ల కృష్ణ కాంత్ ఆధ్వర్యంలో మన రోడ్డు – మన హక్కు నినాదంతో జనసైనికులు వినూత్న నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బురద నీటితో నిండిన రోడ్డు గుంతలలో వరి నాట్లు వేసి, పడవలును జనసైనికులు వదిలి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరైన రోడ్డులు లేక ప్రజలు తీవ్ర  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే ప్రభుత్వం  ఇచ్చిన హామీలను నెరవేర్చి, తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ మండల జనసేన అధ్యక్షులు కంబాల బాబులు, గ్రామ అధ్యక్షులు గండ్రోతు సురేష్, జన సైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way