లుంబూరు గ్రామంలో ఉన్న ఇళ్లపై విద్యుత్ లైన్లను మార్చాలి : జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు

     పాలకొండ, (జనస్వరం) : పాలకొండ నియోజకవర్గం లుంబూరు గ్రామం బీసీ కాలనీలో ఇళ్లపై విద్యుత్ ప్రవాహం అయ్యే విద్యుత్ లైన్లు ఉండడం వలన స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురై ఈ సమస్య పరిష్కారం కొరకు పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భన సత్తిబాబు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన
తక్షణమే స్పందించి ఆ గ్రామానికి వెళ్లి అక్కడ సమస్యలు తెలుసుకుని ఆ సమస్య పరిష్కారం కొరకు పాలకొండ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డి.ఈ.ఈ. మోహన్ చంద్రశేఖర్ కి లుంబూరు సమస్యలపై వినతి పత్రం అందచేయడం జరిగింది. దీనికి డి.ఈ.ఈ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తామని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భన సత్తిబాబు, పాలకొండ పట్టణ నాయకులు గొర్రెల. మన్మధరావు, అనిల్,సాయి, సీతంపేట శ్రీకాంత్, యోగి, వీరఘట్టం మండల నాయుకులు జనసేన జానీ, వెంకటరమణ, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

See also  కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ నోరు అదుపులో పెట్టుకో : జనసేన నాయకులు పవన్ కుమార్