కరిమజ్జి మల్లేశ్వర రావు ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం

పవనన్న

         శ్రీకాకుళం ( జనస్వరం ) : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిన్నపిసిని గ్రామంలో జనసేన పార్టీ నాయకులు కరి మజ్జి మల్లేశ్వర రావు ఉపాధి కూలీలను, రైతాంగాన్ని, కార్మికులను, విద్యార్థులను, మహిళలను అన్ని వర్గాలను కలిసి పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను, ఎన్నికల మేనిఫెస్టోను గూర్చి వారికి తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్రానంతరం అనేక ప్రభుత్వాల పనితీరును మనందరం చూసామని అయినప్పటికీ అనేకమందికి ప్రగతి ఫలాలు అందడం లేదని ఆయన ఆవేదన చెందారు. ఈ రోజుల్లో కూడా ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట తినడానికి, తిండి లేక అనేకమంది ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. ఉపాధి లేక వలసలు పోతున్నారని విద్యావంతులకు ఉద్యోగావకాశాలు కొరత ఏర్పడుతుందని అనేక ఏళ్లుగా భ్రష్టు రాజకీయాలతో అవినీతి లంచగొండితనం పెరిగిపోయి అనేక కుటుంబాల జీవన స్థితిగతుల మారి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు.   ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రానికి మంచి నాయకత్వం, నాయకుడు కావాలని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటందని అన్నారు. కావున రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంత్రిగా గెలిపించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way