ఉరదాళ్ళపాలెం గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఉరదాళ్ళపాలెం

             తణుకు ( జనస్వరం ) : అత్తిలి మండలం మా ఉరదాళ్ళపాలెం గ్రామంలో గ్రామ జనసేన నాయకులు గోలి నరసింహారావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేనపార్టీ క్రీయశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్స్ ని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధిలు చేతులు మీదుగా ఆవిష్కరించడం జరిగింది‌‌‌. ఈ పోస్టర్స్ ని అందించిన టీం పిడికిలి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.  జనసేన నాయకులు మాట్లాడుతూ గ్రామ సమస్యలపై రానున్న రోజుల్లో మన పార్టీ ద్వారా జనసైనికులు అందరూ కలిపి ఒక కార్యచరణ రూపొందించుకుని మనమంతా ఆ సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగుదాం అని తెలియచేసుకోవడం జరిగింది. పార్టీని మన గ్రామంలో మరింత బలోపేతం అయ్యే దిశగా ఇప్పటినుంచి ప్రతి ఒక్క క్రీయశీలక సభ్యుడు కృషి చెయ్యాలని తెలియచెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జిల్లా కార్యదర్శి అన్నెం విశ్వప్రభు, తణుకు నియోజకవర్గ జనసేన నాయకులు అడ్వకేట్ అనుకుల రమేష్, తదితర జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way