పర్చూరు కౌలు రైతు సభకు వెళ్లకుండా ప్రొద్దుటూరు జనసేన నాయకులకి పోలీసుల నోటీసులు

కౌలు రైతు సభ

        ప్రొద్దుటూరు ( జనస్వరం ) : ప్రొద్దుటూరు జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళీను స్టేషన్ కు తీసుకువెళ్ళి నోటిసులు ఇచ్చిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ C.I ఇబ్రహీం.  ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాదాసు మురళీ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు వెళ్లాల్సిన కడప జిల్లా జనసైనికులను అక్రమ అరెస్టుల పేరుతో అడ్డుకోవడం హేయమైన చర్య అని అన్నారు. జనసైనికుల ఇంటి వద్ద, ఫోన్ ద్వారా, రోడ్లపైన ఎక్కడపడితే అక్కడ పట్టుకుని స్టేషన్కు తీసుకెళ్ళి యాత్రకు వెళితే అక్రమ కేసులు పెడతామని నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటన్నారు.  కళ్యాణ్ గారు చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర అంటే ఎందుకు ప్రభుత్వానికి అంత భయం ప్రజాస్వామ్యంలో అక్రమ అరెస్టులు పేరుతో ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన పార్టీని జనసైనికులను ఆపలేరు అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way